పంజాబ్: అక్రమ ఆయుధాల రవాణాను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) భగ్నం చేసింది. అప్రమత్తంగా ఉన్న బీఎస్ఎఫ్ దళాలు పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. బీఎస్ఎఫ్ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా, అబోహర్ బోర్డర్ ఔట్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరు మ్యాగజైన్లతో 3 ఏకే-47 రైఫిల్స్, 91 రౌండ్లు, 4 మ్యాగజైన్లతో రెండు ఎం-16 రైఫిల్స్ ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.