ఇదేనిజం, లక్షెట్టిపేట : టీఎంసీ ఎంపీ ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ మాట్లాడుతున్న వీడియో తీసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వెంటనే ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమళ్ళ హరిగోపాల్ డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విపక్ష 178 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారనే అక్కసుతోనే ఉపరాష్ట్రపతిని అనుకరించారన్నారు. రాజ్యాంగబద్ధ పదవిని విపక్షాలు గౌరవించి, హుందాగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కిషన్, జగన్మోహన్రెడ్డి, వంశీ, సతీశ్, శ్రీనివాస్, రమేశ్, వేణుగోపాల్ రెడ్డి, రమేశ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.