Homeక్రైం300 అడుగుల లోయలో పడిన బస్సు

300 అడుగుల లోయలో పడిన బస్సు

– 36 మంది దుర్మరణం
– 19 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం
– జమ్మూకశ్మీర్​లో విషాదం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. కిష్త్వాఢ్‌ నుంచి జమ్మూ వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 36మంది మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జమ్మూలోని డోడా జిల్లాలో బటోత్‌-కిష్త్వాఢ్‌ జాతీయ రహదారిపై ఈ ఘోరం చోటుచేసుకుంది. కిష్త్వాఢ్‌ నుంచి ప్రయాణికులతో బుధవారం ఉదయం బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో తృంగాల్‌-అస్సార్‌ ప్రాంతానికి చేరుకోగానే దాదాపు 300 అడుగుల లోయలో బస్సు జారిపడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.


ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి


డోడాలో బస్సు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img