మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి గుడి పక్కనే పార్క్ చేసిన బైక్లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 20 బైక్ల వరకు పూర్తిగా ధ్వంసం కాగా.. ఇద్దరికి గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.