Homeఫ్లాష్ ఫ్లాష్Carona Vaccine: రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ రాదు..సీసీఎంబీ డైరెక్టర్‌

Carona Vaccine: రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ రాదు..సీసీఎంబీ డైరెక్టర్‌

హైద‌రాబాద్ః రెండేళ్ల వ‌ర‌కు క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని సీసీఎంబీ డైరెక్ట‌ర్ రాకేష్ మిశ్రా షాకింగ్ న్యూస్ చెప్పారు.

దేశంలో కరోనా వైరస్ త‌గ్గ‌లేద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించారు. ప్రజలు అపోహలు వీడి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనన్నారు.

భారత్ బయోటెక్, అరబిందో ఫార్మా సహా వివిధ కంపెనీలతో కలిసి.. వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు జరుపుతున్నామన్నారు. వచ్చే ఏడాది వ్యాక్సిన్‌పై స్పష్టత రావొచ్చన్నారు.

కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం కష్టమైన వ్యవహరమన్నారు. పరిశోధనలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలని రాకేష్ మిశ్రా తెలిపారు.

పుట్టగొడుగుల్లో ఉండే పదార్థం, ఏఐసీతో కలిసి.. ఇమ్యూనిటీ బూస్టర్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఆహారంతో కలిపి ఈ ఇమ్యూనిటీ బూస్టర్‌ను తీసుకోవాలని రాకేష్‌ మిశ్రా పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img