Homeక్రైంఒవైసీపై కేసు నమోదు

ఒవైసీపై కేసు నమోదు

– ఇటీవల పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన అక్బర్​

ఇదేనిజం, హైదరాబాద్​: ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్​పై కేసు నమోదైంది. ఇటీవల ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్ న‌గ‌ర్‌లోని పోలీసు స్టేష‌న్‌లో ఐపీసీలోని 353(విధుల్ని అడ్డుకోవ‌డం)తో పాటు ఇత‌ర కొన్ని సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అక్బ‌రుద్దీన్‌కు పోలీసులు వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ల‌లితాబాగ్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మయంలో.. ప్ర‌చారం ముగించాల‌ని స్థానికంగా విధులు నిర్వ‌స్తున్న పోలీసు ఆఫీస‌ర్ కోరారు. ఆ స‌మ‌యంలో పోలీసు ఆఫీస‌ర్‌పై అక్బ‌రుద్దీన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Recent

- Advertisment -spot_img