Homeహైదరాబాద్latest Newsఘనంగా సిద్దప్ప వరకవి 121వ జయంతి వేడుకలు

ఘనంగా సిద్దప్ప వరకవి 121వ జయంతి వేడుకలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో కుమ్మరి శాలివాహన మండల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సమాజకవి సిద్ధప్ప వరకవి 121 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సిద్ధప్ప చిత్రపటానికి పూనం పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1903 వ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లె గ్రామంలో జన్మించారు వీరి చాలా పేదరిక కుటుంబం అలాగే సిద్ధప్ప వరకవి మా కుల అభివృద్ధికై చాలా సుదీర్ఘంగా పోరాటం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సిద్ధప్ప వరకవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన జయంతిని వర్ధంతిని అధికారికంగా చేపట్టాలని శాలివాన సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిలివేరి స్వామి ఉపాధ్యక్షులు ఎదునూరి రాములు, క్యాషియర్ దరిపల్లి వెంకటేష్, ప్రధాన సలహాదారులు ఎదునూరి మల్లయ్య, ఆవునూరు ఎల్లయ్య, ఇల్లందుల వెంకటి, ఎదునూరి రామచంద్రం, పట్టణ అధ్యక్షులు ఏదునూరి అంజయ్య, ఉపాధ్యక్షులు దరిపల్లి శంకర్, శాలివాహన యువజన సంఘం అధ్యక్షులు ఎదునూరి భానుచందర్, ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి, ఐలాపురం మహేష్, శంకరయ్య, రాములు, మల్లయ్య స్వామి, లక్మిపతి, అశోక్, మండల వివిధ గ్రామాల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img