Homeహైదరాబాద్latest Newsఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్ : ఇప్పటివరకూ 29 మంది మృతి

ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్ : ఇప్పటివరకూ 29 మంది మృతి

పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకూ 29 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణి తెలిపారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 60 నుంచి 70 మంది మావోయిస్టులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మావోయిస్టులు ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు వహిస్తున్నామని పేర్కొన్నారు. నాయకులు శంకర్, లలిత ఆచూకీ తెలిపిన వారికి రూ.25 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ ఆపరేషన్ చేపట్టిన బృందానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. గాయపడిన పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Recent

- Advertisment -spot_img