ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా మహమ్మారి మాతృ దేశం చైనా. ప్రపంచంలో మొదట కరోనాను కనుగొన్నది అక్కడే అయితే అనూహ్యంగా చైనా నుంచి కరోనా ప్రపంచానికి పాకి అన్ని దేశాల్లో కరోనా ప్రభావం మొదలయిన తరువాత చైనాలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే దీనికి కారణం తాము తీసుకుంటున్న జాగ్రత్తలే అని చైనా అంటుంది. కానీ పలువురు ప్రపంచ రాజకీయ మేధావుల ప్రకారం ఈ వైరస్ను చైనానే తయారు చేసిందని, దానికి సంబందించిన విరుగుడు అంటే వ్యాక్సిన్ కూడా వారి దగ్గర ఉందని అందుకే వారి దగ్గర కేసులు రావడం లేదని అంటున్నారు.
అయితే చైనా ప్రపంచాన్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు కరోనాను ఉపయోగించుకునేందుకు వ్యాక్సిన్ ఇచ్చే పేరుతో షరతులు పెడుతూ అగ్ర దేశంగా ఎదగాలనుకుంది. కానీ వైరస్ గురించి చైనా ముందే చెప్పలేదు, చైనానే ఈ వైరస్ను తయారు చేసిందని పలు దేశాలు బలంగా వాదించాయి. దీంతో పాటు చైనాలోని ఓ డాక్టర్ ముందే వైరస్ గురించి చెప్పడం, అతనిని చైనా అరెస్టు చేయడం, అతను తరువాత చనిపోవడం అన్నీ అనుమానాలను రేకెత్తించాయి. దీంతో ఇప్పుడు వ్యాక్సిన్ను విడుదల చేస్తే ప్రపంచం మొత్తం తామే కరోనాను తయారు చేసి వ్యాక్సిన్ నాటకం ఆడుతున్నామని భావిస్తుందని చైనా భావిస్తుందట. అందుకే చైనా తన వద్ద వ్యాక్సిన్ ఉన్నప్పటికీ పలు దేశాల వ్యాక్సిన్లు విడుదల అయ్యాక తాము విడుదల చేస్తే సమస్య ఉండదని అనుకుంటుందట.
అలా కాకుండా తాము ముందే వ్యాక్సిన్ విడుదల చేస్తే తమపై ప్రపంచ దేశాలకు అనుమానం వచ్చఇ అన్ని దేశాలు కలిసి తమపై యుద్దం చేసే అవకాశమూ ఉందని చైనా బావిస్తుందట. అలాగే రష్యా విడుదల చేస్తున్న వ్యాక్సిన్ కూడా చైనా ఇచ్చిన సమాచారం వల్లే సాద్యమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు గాను రష్యా, చైనా మద్య పెద్ద డీల్ జరిగిందని పలు దేశాలు భావిస్తున్నాయి.