ఇదేనిజం, మల్కాజ్గిరి: పతంకులు కొన్ని కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ఇప్పటికే చైనా మాంజాలతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా చైనా మాంజా ఓ వ్యక్తి ముఖం కోసేసింది. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తికి మాంజా తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన నేరేడ్ మెంట్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. షేక్ పేటకు చెందిన అబ్దుల్ హక్ (37) ద్విచక్ర వాహనంపై కాప్రాకు వెళ్తుండగా.. నేరేడ్ మెంట్ చౌరస్తాలో మాంజా ముఖానికి తగిలి కోయగా గాయమైంది. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.