Homeహైదరాబాద్latest NewsChiranjeevi : ఆ మాటే వెయ్యి ఏనుగుల బలం

Chiranjeevi : ఆ మాటే వెయ్యి ఏనుగుల బలం

మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్‌ కిషోర్‌ రాసిన పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్‌’.మెగాస్టార్ చిరంజీవి మంగళవారం సాయంత్రం ఈ బుక్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.‘సావిత్రమ్మ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆమెతో మంచి అనుబంధం ఉన్నందుకు గర్వపడుతున్నాను. ‘పునాదిరాళ్లు’లో నాకు అవకాశం అనుకోకుండా వచ్చింది. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు పూర్తి కాకుండానే నటించా. ఆ సినిమా కోసం రాజమండ్రి వెళ్తున్నప్పుడు.. నువ్వు సావిత్రమ్మ సినిమాలో నటిస్తున్నావని చెప్పడంతో సంతోషపడ్డాను. చిత్రీకరణకు ముందు ఆమెను చూశాను. ఓసారి నేను డ్యాన్స్‌ చేస్తూ కిందపడ్డా. అయినా సరే ఆపలేదు. అది చూసిన ఆమె.. ‘భవిష్యత్తులో మంచి నటుడివి అవుతావు’ అని మెచ్చుకున్నారు. ఆ మాట నాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. కొన్నేళ్ల తర్వాత ‘ప్రేమ తరంగాలు’ కోసం పనిచేశాం. ఆమె నాకు తల్లిగా నటించారు. ఆ తర్వాత ఆమెతో నటించే అవకాశం రాలేదు. కళ్లతోనే హావభావాలు పలికించే గొప్ప నటి. ప్రపంచంలో ఆమెలా మరెవ్వరూ చేయలేరు. మా నాన్న అభిమాన నటి. అనుక్షణం ఆమెను ఆరాధిస్తుంటా’అని చిరంజీవి అన్నారు

Recent

- Advertisment -spot_img