Homeతెలంగాణమురుగు కాల్వలను శుభ్రం చేయరా?

మురుగు కాల్వలను శుభ్రం చేయరా?

ఇదేనిజం, నల్లబెల్లి : గ్రామాల్లో మురుగు కాల్వలు నిండుకున్నాయి. దాంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. మండల పరిధిలోని నందిగామ గ్రామంలోని మొదటి వార్డులో డ్రైనేజీలు మట్టితో కూరుకపోయాయి. దీంతో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. పిల్లలు, వృద్ధులకు విషజ్వరాలు వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు, పాలకులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img