HomeTelugu NewsUPSC చైర్మన్​తో CM రేవంత్​ భేటీ

UPSC చైర్మన్​తో CM రేవంత్​ భేటీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్​ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ చైర్మన్​ రాజీనామా చేయగా.. ఆ అంశం పెండింగ్​ లో ఉంది. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి.. శుక్రవారం యూపీఎస్సీ చైర్మన మనోజ్ సోనీని కలిశారు. యూపీఎస్సీ పరీక్ష నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డితో పాటూ.. అధికారులు సైతం అధ్యయనం చేస్తున్నారు. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్ పీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img