ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ క్యాడర్ కు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. ఫిబ్రవరి 6న కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియనుండడంతో.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని చెప్పారు.
ఇది కూడా చదవండి: రైతుబంధుపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్
ఓట్ల నమోదుపై అశ్రద్ద చూపొద్దని.. ఎన్నికల ముందు చాలా మంది సీట్లు ఆశిస్తారు.. కానీ కొందరికే సీట్లు ఎంపిక చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఫలితం ఉంటుందని ఆయన చెప్పారు.