Homeహైదరాబాద్latest NewsSTUDENTSకు CM రేవంత్ గుడ్ న్యూస్..

STUDENTSకు CM రేవంత్ గుడ్ న్యూస్..

పేద విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉన్నత చదువులు చదివే నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్తు బాసటగా మహాత్మ జ్యోతిబాపూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి పక్కాగా స్కీం అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. టాలెంట్ ఉన్న పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

Recent

- Advertisment -spot_img