Homeజిల్లా వార్తలుకులం పేరుతో దూషించిన వ్యక్తి పై ప్రజావాణిలో ఫిర్యాదు..

కులం పేరుతో దూషించిన వ్యక్తి పై ప్రజావాణిలో ఫిర్యాదు..

ఇదే నిజం జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల పరిధిలోని కొల్వాయి గ్రామానికి చెందిన రామ కిట్టు గంగాధర్ పై మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన కామెర రాజేశ్వర్, వంచిత్ బహుజన అగాడి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్, నేతకాని రాష్ట్ర కన్వీనర్ కొత్తపల్లి గంగేష్, సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ.. ఇరాక్ పంపిస్తానని చెప్పి రాజేశ్వర్ ను మోసం చేసి అతని దగ్గర నుండి అక్షరాల 7 లక్షల 30 వేల రూపాయలు తీసుకొని ఇవ్వకుండా, అతని ఇంటికి రమ్మని నానా బూతులు తిడుతూ కొట్టి చంపుతానని బెదిరిస్తూ భ్రయభ్రాంతులకు గురి చేస్తున్న రామ కిట్టు గంగాధర్ ఫై ఉన్నత అధికారులు వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img