Delhi : మద్యం కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్పై వాదనలు ముగిసాయి. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. కుమారుని పరీక్షల సమయంలో కవిత ఇంట్లో ఉండడానికి అవకాశం ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన కవిత తరఫు న్యాయవాదులు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్ ఇస్తే కేసు పురోగతి ఉండదని Enforcement Directorate పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.