Homeజిల్లా వార్తలుకాంగ్రెస్‌ నాయకుడు మృతి

కాంగ్రెస్‌ నాయకుడు మృతి

– నివాళి అర్పించిన నల్లబెల్లి మండల నాయకులు

ఇదేనిజం, నల్లబెల్లి: వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు లకిడే శంకర్‌రావు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతదేహంపై పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి మాలోత్‌ రమేష్‌ పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వైనాల అశోక్‌, ఇస్తారు శేఖర్‌ గౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్సీ సెల్‌ జిల్లా కో కన్వీనర్‌ బొంపల్లి శ్రీనివాస్‌, మండల కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, నాయకులు రఘు, సాల హనుమంతు, శివాజీ, బాలరాజు, కక్కర్ల అనిల్‌, కార్యకర్తలు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img