Homeజిల్లా వార్తలుబెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ఆర్ 75వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్...

బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ఆర్ 75వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు ‌

ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే ఆదేశానుసారం స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి 75వ జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, కేకు కట్ చేసిన టి పి సి సి రాష్ట్ర ప్రచార కమిటి జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఉచిత కరెంటు మరియు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేదల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తు చేస్తూ వైఎస్ఆర్ ఆశలను ముందుకు తీసుకుపోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ సి, సెల్ నాయకులు మల్లారపు చిన్న రాజం, టిపిసిసి రాష్ట్ర ఓబిసి సెల్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర మహిళా నాయకురాలు రోడ్డ శారద, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బండి రాము, టౌన్ వైస్ ప్రెసిడెంట్ లంకల శ్రీనివాస్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img