Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్..అసత్య ప్రచారాలు మానుకోండి.. బొంపల్లి సురేందర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్..అసత్య ప్రచారాలు మానుకోండి.. బొంపల్లి సురేందర్ సంచలన వ్యాఖ్యలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక రోడ్డు ముస్తాబాద్ నుండి రాజక్క పేట వరకు 14 కోట్ల నిధులతో ఆగస్టు 2003లో మదర్ తెరిసా కాలేజ్ డబుల్ రోడ్డు మంజూరు చేస్తే అదే సమయంలో ఎలక్షన్ కోడ్ అమలైంది ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత డిసెంబర్ 2023లో అర్జున్ కన్స్ట్రక్షన్ కు టెండర్ అగ్రిమెంట్ అయ్యిందని, పనులు ప్రారంభించే దశ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 14 కోట్ల డబుల్ రోడ్డు నిధులను రద్దు చేసిందని టిఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని మాజీ మంత్రి కేటీఆర్ కనీసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముస్తాబాద్ పట్టణంలో డబుల్ రోడ్డు డివైడర్ ఐమాక్స్ లైట్లు నూతన మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం పెద్ద చెరువు ఆధునీకరణ గ్రామాలలో అనేక రోడ్డు వంతెనలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అని అన్నారు. కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్ అసత్య ప్రసారాలు మానుకొని అభివృద్ధిని చెయ్యండి దానికి మేము కూడా సహకరిస్తామని అన్నారు. దుబ్బాక రోడ్డును టెండర్ వేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, చెవుల మల్లేశం, బిఆర్ఎస్ నాయకులు నవాజ్ కోడే శ్రీనివాస్, శీలం స్వామి, మెంగని మనోహర్, కంచం నరసింహులు, వెంకటేష్ టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img