Homeజిల్లా వార్తలుబస్టాండ్ రోడ్డుకు మరమ్మతులు చేసిన కాంగ్రెస్ నాయకులు

బస్టాండ్ రోడ్డుకు మరమ్మతులు చేసిన కాంగ్రెస్ నాయకులు

ఇదేనిజం, నాగార్జునసాగర్: పైలాన్ బస్టాండ్ రోడ్డు గుంతలతో అధ్వాన్నంగా ఉండడంతో గుంతలలో మట్టి పోసి గుంతలు పూడ్చివేసే కార్యక్రమం గురువారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఓబిసి అధ్యక్షులు జంగన్న మాట్లాడుతూ.. బస్టాండ్ రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా ఉందని విషయంను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి స్పందించి.. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పిల్లర్ నుండి బస్టాండ్ వరకు ఉన్న రోడ్డుని మట్టి నింపించి తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు సునంద రెడ్డి, జానకి రెడ్డి, మద్దాల భాను, బడుగు సుమన్ ,బాలు, జానీ, మస్తాన్, ఆరిఫ్, రంగా రంగా నాయక్, రఘు, దత్తు, కృష్ణ ,అనిల్, అబ్రహం, జానీ డిక్కొండ వేణు, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img