ఇదే నిజం, నాగార్జునసాగర్ : అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జయ వీర్ రెడ్డిని పైలాన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దీకొండ వేణు, విగ్నేష్ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే జై వీర్రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.