ఆంద్రప్రదేశ్లో కరోనా విజృంభన కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 10825 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక కరోనాతో తాజాగా 71 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 487331 కి చేరింది. మొత్తం మరణాలు 4347 కాగా 100880 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. 382104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటలలో 69623 నమూనాలను పరీక్షించారు. కొత్తగా 11941 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4035317 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక అత్యదికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1399 కేసులు నమోదయ్యాయి.