న్యూఢిల్లీః యూరప్ కంట్రీస్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మహమ్మారి రెండో దెబ్బకి ఫ్రాన్స్, జర్మనీ మళ్లీ లాక్డౌన్ను ప్రకటించాయి.
ఆ రెండు దేశాల్లో మాత్రం కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువైంది. ఉన్నట్టుండి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆయా దేశాల్లో కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే దారిలో మరి కొన్ని యూరప్ దేశాలు కూడా లాక్డౌన్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
గత 24 గంటల్లో ఈ యూరప్ దేశంలో కొత్తగా 244 కరోనా మరణాలు సంభవించాయి. 36 వేల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు.
ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిసెంబరు 1 వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు.
జర్మనీలో కూడా రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయ్. కొత్తగా 14 వేల కేసులు నమోదయ్యాయ్.
దీంతో నవంబర్ 2 నుంచి కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ప్రకటించారు.