అందించనున్న పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్
ప్రపంచానికి భారత్ సంజీవనిగా మారనుంది. కరోనాతో కకావికళం అవుతున్న ప్రపంచానికి తక్కువ ధరకే వ్యాక్సిన్ను అందించనున్నట్లు భారత్కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. కేవలం రూ.225 రూపాయలకే కోవిడ్19 వ్యాక్సిన్ను ప్రజలకు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సంస్థ ప్రకటించింది. ఇందుకు గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారాన్ని అందించనుంది. ఇందుకు సంబందించిన కీలక ఒప్పందం పూర్తి అయింది. దీంతో భారత్తో సహా దాదాపు 100 దేశాలకు ప్రయోజనం చేకూరనుంది. పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు గేట్స్ ఫౌండేషన్ 150 మిలియన్ డాలర్ల నిధులు ఇవ్వనుంది. దీంతో భారత్లో కోట్లాది మందికి తక్కువ ధరకే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపడేలా దాదాపు 10 కోట్ల డోస్లను తయారు చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 2021 నాటికి ప్రపంచ దేశాలకు అతి తక్కువ ధరకే వ్యాక్సిన్ అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.