Homeజిల్లా వార్తలుప్రతి 3నెలలకు ఒకసారి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి..

ప్రతి 3నెలలకు ఒకసారి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి..

ఇదేనిజం, మల్కాజిగిరి: నగరంలో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురువారం మేయర్ గద్వాల విజయ లక్ష్మి, జిహెచ్ఎంసి కమీషనర్ రొనాల్డ్ రోస్ ను కార్పొరేటర్ శ్రవణ్, ఆకుల శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రంను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో పేరుకు పోయిన సమస్యలను చర్చించేందుకు ప్రతి మూడు నెలలకు ఒక సారి పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయట్లేదని, వెంటనే పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరారు. ముఖ్యంగా అనాధికారిక పార్కింగ్ ల పేరుతో కొన్ని సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ప్రజల నడ్డి విరుస్తున్నారని వాటిపైన చర్యలు తీసుకోవాలన్నారు

Recent

- Advertisment -spot_img