Homeక్రైంబాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

ఇదే నిజం, వరంగల్‌ ప్రతినిధి: పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకుడు కంచ క్రిష్ణ (కిట్టు) రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్రిష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన అర్శనపల్లి సమ్మక్క, అయిలి రవీందర్‌ గౌడ్‌, చిట్టిరెడ్డి కళింగ రెడ్డి ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధర్మారెడ్డి వెంట ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Recent

- Advertisment -spot_img