Homeక్రైంcourt:అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

court:అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

court:అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన వనపర్తి ఫోక్సో కోర్టు వనపర్తి జిల్లా మదనాపురం మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన ఓ బాలికను అత్యాచారం చేసిన దోషికి ఫోక్సో కోర్టు జడ్జి సునీత బుధవారం 20 ఏళ్ల పాటు జైలు శిక్ష ,రెండు వేల రూపాయల జరిమానా ను విధించారు.

బాలికలు, మహిళల పట్ల జరిగే నేరాలపై న్యాయస్థానం సీరియస్ గా వ్యవహరించింది. వనపర్తి ఫోక్సో కోర్టు లో ఇది మొదటి తీర్పు అని వనపర్తి అదనపు జిల్లా కోర్టు పీపీ చంద్రశేఖర్ రావు తెలిపారు. జిల్లా ఫోక్సో కోర్టు లో ఇది మొదటి తీర్పు కావడంతో మహిళా సంఘాలు తీర్పును హర్షిస్తున్నాయి. బాలికలు, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు శిక్ష లు కఠినంగా ఉంటాయని జడ్జి సునిత ఈ సందర్భంగా హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img