టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నల గడ్డ హీరోగా నీరజ కోన డైరెక్షన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ‘తెలుసు కదా’అనే క్రేజీ టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇది ఓ డిఫరెంట్ ప్రేమ కథా నేపథ్యంలో సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఇది ఒక అబ్బాయి – అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ మాత్రమే కాదు.. స్నేహం, కుటుంబం, త్యాగం వంటి అంశాలు ఈ కథలో హైలైట్గా ఉంటాయంటున్నారు. ఇక ఈ మూవీలో కేజేఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రచయిత కోన వెంకట్ సోదరి అయని నీరజ కోన సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలకు కాస్ట్యూమ్స్ స్టైలిషర్గా పనిచేశారు. ఫిల్మ్ మేకర్గా ఆమె ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి షురూ కానుంది.