Homeక్రైంCrime News : Hyderabad-Mumbai బస్సులో మంటలు

Crime News : Hyderabad-Mumbai బస్సులో మంటలు

– అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేసిన డ్రైవర్
– ప్రయాణికులు సేఫ్​

ఇదే నిజం, హైదరాబాద్: బస్సు డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ముంబయి వెళ్తున్న ప్రైవేటు బస్సు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో ప్రమాదానికి గురైంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కన బస్సును నిలిపివేసి ప్రయాణికులను అలర్ట్ చేశాడు. దీంతో ప్రయాణికులు క్షణాల్లోనే బస్సును ఖాళీ చేశారు. ఆ వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రయాణికుల లగేజీలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Recent

- Advertisment -spot_img