Homeహైదరాబాద్latest NewsCrime Updates : స్కూల్ బస్సు బోల్తా..6 మృతి

Crime Updates : స్కూల్ బస్సు బోల్తా..6 మృతి


– ఆరుగురు చిన్నారులు మృతి
– హర్యానాలోని మహేంద్రగఢ్​లో ప్రమాదం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: స్కూల్ బస్సు బోల్తా పడి ఆరుగురు చిన్నారులు చనిపోయిన ఘటన హర్యానాలోని మహేంద్రగఢ్​ జిల్లాలో జరిగింది. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా గురువారం సెలవు అయినప్పటికీ కనైనా ప్రాంతంలో ఓ స్కూల్‌ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే స్టూడెంట్లు స్కూల్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఘటనా సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకి చేరుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గాయపడిన స్టూడెంట్లను సమీప ఆసుపత్రికి తరలించారు. హర్యానా విద్యాశాఖ మంత్రి సీమా ట్రిఖా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ 2018లోనే గడువు ముగిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img