HomeSocial Mediaహైదరాబాద్ వాసులకు భారీ షాక్.. నేటి నుంచి కరెంట్ కోతలు

హైదరాబాద్ వాసులకు భారీ షాక్.. నేటి నుంచి కరెంట్ కోతలు

హైదరాబాద్‌ నగరానికి విద్యుత్‌ అధికారులు భారీ షాక్‌ ఇచ్చారు. నేటి నుంచి నగరంలో కరెంట్‌ కోతలు విధిస్తున్నట్టు తెలిపారు. విద్యుత్‌ స్తంభాల మరమ్మత్తు , వార్షిక నిర్వహణలో భాగంగా ఈ కోతలను విధిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ విద్యుత్ కోతలు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నందుకు చింతిస్తున్నట్లు TSSPDCL ఎండీ ముషారఫ్‌ అలీ ఫరూఖీ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. 

జనవరి 17 బుధవారం నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా ఈ కరెంట్‌ కోతలు ఉంటాయని తెలిపారు. వచ్చే వేసవి కాలం/ రబీ సీజన్స్‌ లో అధికంగా విద్యుత్‌ డిమాండ్‌ ఉండడంతో దానికి సిద్దం కావడం కోసం వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల పాటు విద్యుత్‌ కోతలు ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

Recent

- Advertisment -spot_img