Homeజిల్లా వార్తలుదేవరకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని సన్మానించిన దళిత సంఘం నాయకులు

దేవరకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని సన్మానించిన దళిత సంఘం నాయకులు

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలో ఇటీవల నూతనంగా దేవరకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైయస్ కరుణాకర్ ను సోమవారం స్థానిక సిల్వర్ జూబ్లీ క్లబ్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ కర్ణాకర్ జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని వారు తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఏ పదవులు చేపట్టిన ఆ పదవికి పూర్తిస్థాయి వన్నె తీసుకొచ్చేటువంటి వ్యక్తి కరుణాకర్ అని పేర్కొన్నారు. గతంలో కౌన్సిలర్ గా తమ వార్డులోనే కొనసాగారని దళిత హరిజన గిరిజన బడుగు ముస్లిం మైనార్టీ వర్గాల కోసం ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తుండిపోతాయని గుర్తు చేసుకున్నారు. సహాయమని వచ్చిన వారికి అప్పన్నహస్తం అందించే గుణం ఉన్న వ్యక్తి కర్ణాకర్ అని తెలిపారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ సమాజంలో వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నట్లయితే పదవులు తప్పకుండా వస్తాయని ప్రతి వ్యక్తి తనలో తాను పరివర్తన కోసం పనిచేయాలని అప్పుడే సమాజం గర్విస్తుందని తెలిపారు. దళిత సంఘాల నాయకులు తనను ఇంత ఆపేయంగా ఆహ్వానించి సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. సీనియర్ న్యాయవాది నెమ్మికంటి గౌరీ శంకర్ మాట్లాడుతూ కరుణాకర్ చిన్నతనం నుండి తెలుసని కరుణాకర్ తండ్రి ఏ కుల సుదర్శన్ చిరకాల మిత్రుడని ఆయన కర్ణాకర్ సైతం మంచి ఉన్నత స్థితిలో మరెన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శిగా నియమితులైన ముసిని అంజన్ సైతం సన్మానించారు. సన్మానించిన వారిలో దళిత సంఘం నాయకులు అంకురి వెంకటయ్య, ముసిని అంజన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకురి శివ, కొండపల్లి రమేష్ మాజీ ఎంపీటీసీ పొట్ట బుచ్చయ్య ,పాస్టర్ ప్రసాద్, అంకూరి దానయ్య ,సత్యం, సిటీ కేబుల్ రమేష్ ,రాములు, స్టే అండ్ సి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img