ఇదేనిజం ములుగు ప్రతినిధి : గత ప్రభుత్వం అక్టోబరులో తమకు దళిత బంధు మంజూరు చేసిందని, అయితే ఎలక్షన్ కోడ్ రావడంతో నిలిపివేశారని తమ ఖాతాలకు నిధులు జమ చేయాలని అర్హులు కోరారు. మంగళవారం ములుగు జిల్లా ఏటురూనాగారంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అర్హులు స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తమకు నిధులు రాలేదని వెంటనే నిధులను తన బ్యాంక్ ఖాతాలో వేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులు పాల్గొన్నారు