Homeహైదరాబాద్రౌడీషీటర్​ ఆయాజ్​ ఉద్దీన్​ మర్డర్​ కేసులో నిందితులు రిమాండ్

రౌడీషీటర్​ ఆయాజ్​ ఉద్దీన్​ మర్డర్​ కేసులో నిందితులు రిమాండ్

హైదరాబాద్​, ఇదేనిజం – రెయిన్​ బజార్​ పీఎస్​ సీఐ ఆంజనేయులు వెల్లడి…. పాతబస్తీ యాకుత్​పురా రెయిన్​బజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శనివారం రాత్రీ 9గంటల సమయంలో సయ్యద్​ఆయాజ్​ఉద్దీన్​–32, రౌడీషీటర్​ దారుణ్య హత్యకు గురైన విషయం విధితమే… ఈ మర్డర్​కు సంబందించిన పూర్తి వివరాలను ఏసీపీ బత్తుల ఆనంద్​, సీఐ ఆంజనేయులుతో కలిసి వెల్లడించారు. యాకుత్​పురా బస్తీకి చెందిన సయ్యద్​ఆయాజ్​ఉద్దీన్​–32, రౌడీషీటర్​, ఇతడు గతేడాది మొగల్​పురా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఒక రౌడీషీటర్​ అమెర్​పఠాన్​ అను తన మిత్రులతోకలిసి కత్తులో ఆతిదారుణంగా పోడిచి హత్య చేయడంతో అతడు సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. దీంతో మొగల్​పురా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేసి నిందితులను పట్టుకుని రిమాండ్​కు తరలించారు. అయితే ఇ హత్యలో ప్రధాన నిందితుడు సయ్యద్​ఆయాజ్​ ఆలీయాస్​ కండా ఆయాజ్​–32, చేశాడని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో ఆనాటినుంచి సమయం కోసం ఎదురుచుస్తున్నారు. అయతే శనివారం రాత్రీ 9గంటల సమయంలో ఆయాజ్​ఉద్దీన్​ యాకుత్​పురా వెస్ట్​ చంద్రానగర్​ బస్తీ డీకాషన్​ హోటల్​ వద్ద ఉన్నాడని సమాచారం అందుకున్న ఆమేర్​ సోదరులు ఇతరులతోకలిస బైక్​పై అక్కడికి చేరుకుని ఆయాజ్​ఉద్దీన్​పై కత్తులతో విక్షణ రహితంగా దాడిచేయడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డెడ్​బాడిని పోస్ట్​మార్టం కోసం ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మర్డర్​ వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అనుమానంతో సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ టీం, రంగంలోకి దిగి నిందితుల వేట కోనసాగించింది. అయితే గురువారం యాకుత్​పురా రెయిన్​ బజార్​ బస్తీలోని ఒక గుర్తుతెలియని ఇంటిలో మర్డర్​చేసిన నిందితులు ఉన్నారన్న సమాచారం అందడంతో టాస్క్​ఫోర్స్​ ఎస్​ఐలు, రెయిన్​బజార్​ పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి నిందితులు 1 అహ్మద్​హుసేన్​ ఆలీయాస్ గజీని ఆమేర్​–26, మహ్మద్​ మసీఉద్దీన్​–23, మహ్మద్​ సల్మాన్​ఖాన్​–30, మహ్మద్​ ఇలీయాస్​ ఆలీయాస్​ జానీ–26, మహ్మద్​ ఇబ్రాహీంఖాన్​ ఆలీయాస్​ అబ్బు–25, మహ్మద్​ అస్లంఖాన్​ ఆలీయాస్​ ఆషు–23, మహ్మద్​ ఇమ్రాన్​ఖాన్​–26, తదితరులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి మూడుబైకులు, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకుని స్టేషన్​కు తరలించి విచారించగా నేరం అంగికరించడంతో వారిపై మర్డర్​ సెక్షన్​ ప్రకారం కేసు నమోదుచేసి నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్​కు తరలించారు. అయితే పోలీసు విచారణలో ఇందులో పేరుమోసిన ఇద్దరు రౌడీషీటర్​ మసీఉద్దీన్​, అహ్మద్​హుసేన్​, కీలక పాత్రం పోషించారని తెలింది.

Recent

- Advertisment -spot_img