దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ (63), హర్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఓ మ్యాచ్లో మొత్తమ్మీద 500 పరుగులు నాలుగోసారి నమోదవడం విశేషం. దిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ ఆసాంతం ఫోర్లు, సిక్సర్ల వర్షంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.