భానుడి ప్రతాపానికి దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నగరాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్11-19 మధ్యలో వడదెబ్బ కారణంగా 192మంది నిరాశ్రయులు మృత్యువాత పడినట్లు సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ (సీహెచ్డీ) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. గడిచిన 48గంటల్లో 50 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత రెండు రోజుల్లో లభ్యమైన మృతదేహాల్లో 80శాతం నిరాశ్రయులవేనని సీహెచ్డీ పేర్కొంది.