రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ విధ్వంసం థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ అయిన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. రూ. 500 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు పెడుతోంది. అయితే, ఈ సినిమా నైజాం ఏరియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. సలార్ ప్రభాస్కు కమ్ బ్యాక్ మూవీ అనే చెప్పాలి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా లాంగ్ రన్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.