Homeజిల్లా వార్తలుభక్తి భావాన్ని పెంపొందించుకోవాలి

భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి

– ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి
– నేపాల్​ భలేశ్వర్​నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇదేనిజం, పటాన్​చెరు : ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకొని ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు సమీపంలోని భలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి భావంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్​పూర్ జెడ్పీటీసీ సుధాకర్​రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, సీనియర్ నాయకులు వెంకట్​రెడ్డి, దశరథ్​రెడ్డి, పాండు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img