– ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
– నేపాల్ భలేశ్వర్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఇదేనిజం, పటాన్చెరు : ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకొని ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు సమీపంలోని భలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి భావంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, సీనియర్ నాయకులు వెంకట్రెడ్డి, దశరథ్రెడ్డి, పాండు, రాజు తదితరులు పాల్గొన్నారు.