– మునిసిపల్ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
–హుస్నాబాద్లో మెడికల్ కళాశాల కోసం స్థల సేకరణ
– గౌరవెల్లి ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటాం
ఇదేనిజం, హుస్నాబాద్: రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పని చేస్తానని, ఏ సమస్యలు ఉన్న మధ్యవర్థుల ప్రమేయం లేకుండా నేరుగా తనను కలవవచ్చునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మునిసిపల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మిడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మునిసిపల్ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల వరకే రాజకీయమని అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. హుస్నాబాద్లో మెడికల్ కళాశాల కోసం స్థల సేకరణ జరుగుతుంది. హుస్నాబాద్లో కేంద్ర విద్యాలయం కోసం ప్రయత్నిస్తున్నాను. హుస్నాబాద్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి నియోజకవర్గానికి హుస్నాబాద్ దిక్సూచి కావాలన్నారు. హుస్నాబాద్ నుంచి ఏ ప్రాంతానికి వెళ్లినా హుస్నాబాద్ ప్రజలు తల ఎత్తుకుని తిరిగేలా తాను కృషి చేస్తానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. గౌరవెల్లి ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని గౌరవెల్లి పనులను సకాలంలో పూర్తి చేయించి త్వరలో ప్రజలందరి సమక్షంలో ప్రారంభించుకుందామని అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.