Homeహైదరాబాద్latest Newsదుర్గమ్మ దయతో మెదక్ అభివృద్ది

దుర్గమ్మ దయతో మెదక్ అభివృద్ది

– ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

ఇదే నిజం, మెదక్ ప్రధాన ప్రతినిధి: దుర్గమ్మ దయతో మెదక్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. గురువారం ఏడుపాయల వనదుర్గా భవానీ మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయానికి వచ్చే భక్తులు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు , అదనపు కలెక్టర్లు రమేశ్ , వెంకటేశ్వర్లు , ఆర్డీఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img