Homeజాతీయందావూద్ ఇంటినెందుకు కూల్చ‌లేదుః ఫ‌డ్న‌వీస్‌

దావూద్ ఇంటినెందుకు కూల్చ‌లేదుః ఫ‌డ్న‌వీస్‌

ముంబాయి: మహారాష్ట్ర ప్ర‌భుత్వం, సినీ న‌టీ కంగనా రౌన‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్ధంపై బీజేపీ పార్టీ స్పందించింది. బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ సీఎం దేవేంద్ర‌ ఫ‌డ్న‌వీస్ ఘాటుగా చుర‌క‌లు అంటించారు. బొంబాయి పేలుళ్ల‌కు కార‌ణ‌మై వంద‌ల మంది మృతికి కార‌కుడైనా దావూద్ ఇబ్ర‌హీం ఇంటిని కూల్చ‌కుండా ఎందుకు ఉన్నార‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఇగోకు పోయి కంగ‌నా ఆఫీస్‌ని ఎందుకు కూల్చ‌డం స‌రికాద‌ని పరోక్షంగా ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టాడు. క‌రోనా కార‌ణంగా రోజూ వేలాది కేసులు న‌మోదు అవుతుంటే.. వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నా ఈ స‌మ‌యంలో క‌రోనాపై యుద్ధం చేయ‌కుండా కంగ‌నాపై యుద్ధం చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఆమెపై చేసే పోరాంటంలో స‌గం శ‌క్తిని కరోనాపై పోరాటంలో వాడితే ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని హిత‌వు ప‌లికారు. ఒక హీరోయిన్ చేసే ఆరోపణలపై అనవసర బేషజాలకు వెళ్లవద్దని ఆయ‌న ప్రభుత్వానికి సూచించారు.

Recent

- Advertisment -spot_img