ఇదే నిజం, కోహెడ: కోహేడ మండలం లో ధరణి లో మార్పులు రైతులకు తెల్వకుండనే మార్పులు జరిగినవి వివరాల లోకి వెళ్తే చెంచర్ చెరువుపల్లి గ్రామానికి చెందిన జేరిపోతుల కనుకవ్వ భర్త కొమురయ్య కు 1993-1994 సంవత్సరం లో lps స్కీమ్ క్రింద కోహిడ శివారులో సర్వే నం 971/10 లో 1-07గుంటల వ్యవసాయ భూమి ని ప్రభుత్వము ఇచ్చింది దీనికి ధరణి లో పాస్ బుక్ టీ నం T10100081029 ఖాతా నం 1734 కానీ ఇపుడు ఈ ధరణి పాస్ బుక్ మారి కొత్త పాస్ బుక్ వచ్చింది. పాస్ బుక్ నంబర్ T10100081012 ఖాతా నంబర్ 1717 సర్వే నం.974/3 1-15గుంటల భూమి నమోదు అయింది. ఒరిజనల్గా కనకవ్వకు ఉండవలసిన భూమి సర్వే నం.971/10 లో ఎకరా 7 గుంటలు ములవాత్ నాగేంద్ర నాయక్ గారి పేరు మేదికి మార్చబడింది. మా ప్రమేయం లేకుండా ఇది ఎలా జరిగింది ఆని తహసీల్దార్ గారిని వివరణ కోరగా మా వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.ధరణి విషయం లో సామాన్యుడు చిన్న మార్పులు చేసుకోవాలంటే సవాలక్ష ఆధారాలు అడిగే రెవెన్యూ అధికారులు రైతుకు సంబంధం లేకుండానే రైతు పేరు మీద ఉన్న భూమిని వేరే వారి పేరు మీదకి మార్చి రైతు టి నంబర్,మరియు ఖాతా నంబర్ మార్చడం ఎలా సాధ్యమైంది.దినికి ధరణి అధికారులు సమధానం చెప్పాలి. తమకు న్యాయం చేయాలని జెరిపోతుల కనుకవ్వ గారి భర్త కొమురయ్య అధికారులను వేడుకుంటున్నారు.