ఇదే నిజం, ధర్మపురి టౌన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో తొలిసారి నిర్వహించిన ఈఏపీసెట్ (TS EAPCET) ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం నేడు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఎడపల్లి గ్రామానికి చెందిన పత్తి మోహన్ కుమార్తె పత్తి అక్షిత 1798వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఈ అమ్మాయిని గ్రామస్తులందరూ అభినందించారు.