టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు షాక్ కలిగించే నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్టు ధోని శనివారం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఈ సందర్బంగా ఇన్ని సంవత్సరాలుగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. ధోని కెప్టెన్సీలో టీమిండియా వన్డే, టీ-20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిలు సాధించింది. గతంలోనే టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగిన ధోని, టీ-20 వన్డే, జట్లలో సాదారణ ఆటగాడిగా కొనసాగాడు. ధోని నిర్ణయంతో యావత్ క్రీడా అభిమాన లోకం షాక్కు గురయింది. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధోని ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి దుబాయ్లో ఉన్నాడు. ఈ నిర్ణయం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. ఇక దోనీ దారిలోనే రైనా కూడా క్రికెట్కు గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.