Homeఫ్లాష్ ఫ్లాష్కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ

కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ కృష్ణవంశీకి కష్టకాలం నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అవుతోన్న చిత్రాలు అంతగా ఆడటం లేదు. ప్రేక్షకుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.

గులాబీ, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్ం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. సినీ పరిశ్రమలో కృష్ణవంశీ చిత్రాలు చాలా ప్రత్యేకం. కానీ కొంతకాలంగా కృష్ణవంశీ తెరకెక్కించిన లు థియేటర్లలో కమర్షియల్ హిట్స్ అందుకోలేకపోతున్నాయి. అలాగే ఇప్పటితరం ప్రేక్షకులు కృష్ణవంశీ చిత్రాలకు కనెక్ట్ కాలేకపోతున్నారనేది మరో వాస్తవం.

ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా కృష్ణవంశీ సైలెంట్ అయ్యారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో అనాథను అయిపోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులుగా నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించారు. మే 20న సిరివెన్నెల జయంతి సందర్భంగా ఈరోజు ఈ వేడుకను నిర్వహించగా.. సినీ ప్రముఖులు, సింగర్స్ పాల్గొన్నారు. ఈ వేడుకకు డైరెక్టర్ కృష్ణవంశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో కృష్ణవంశీ మాట్లాడుతూ సిరివెన్నెలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

కృష్ణవంశీ మాట్లాడుతూ.. “సిరివెన్నెల శాస్త్రి గారితో 1989 నుంచి పరిచయం ఉంది. ఆయన దొరకడం మహా అదృష్టం. ఏ అర్హత లేకపోయినా నన్ను కొడుకుగా స్వీకరించి.. వాళ్ల ఇంట్లోనే ఉండేవాళ్లం. ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆరేడు నెలల నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని.. పాటలు ఏం చేయాలో అర్థం లేదు. ఆయన ఉప్పుడు ఇలాంటి పాటలు ఉంటాయి. ఇలాంటి కథ అని అనుకుని ఆయన దగ్గరకు వెళ్లేవాడిని. అలాంటిది ఇవాళ అది లేదు. ఒక రకంగా ఇండస్ట్రీలో అనాథను అయిపోయాను” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Recent

- Advertisment -spot_img