Divyavani : టీడీపీలో కరివేపాకులా వాడుకుని వదిలేశారు
Divyavani : తెలుగుదేశంలో నెమ్మదిగా నా డౌన్ ఫాల్ మొదలైందని అర్ధమైందని.. గౌరవం లేనిచోట ఉండలేక పార్టీకి రాజీనామా చేస్తున్నానని సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు.
మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడులా పార్టీ లేదు బొక్కా లేదని నేను అన్నానా..? మీడియాతో బాధను పంచుకోవడమే తప్పా..? నన్ను తప్పు పట్టిన వాళ్లు.. అచ్చెన్నని ఏం శిక్షించారు..? పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మందే ఉన్నారు.
నారీ-భేరీకి డబ్బులు తీసుకుని మేకప్ చేసుకుని కూర్చొవడం లేదు.
చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే.. ముందు నేనే కౌంటర్ ఇచ్చాను. నేనిచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు.
టీడీ జనార్జన్ ను ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారు. టీడీపీలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని చెప్పినా నేను వినలేదు.
మహానాడు వేదిక మీద కూర్చొవడానికి, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.
ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. నన్ను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు.
పార్టీలో నా డబ్బుతో నేను ఖర్చు పెట్టుకుని పని చేశాను’ అని అన్నారు.