ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలోని తీగలవేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను, డి.ఎం.హెచ్.ఓ డాక్టర్. బి.కళావతి బాయి ఆశ డే సందర్భంగా సందర్శించారు. అన్ని జాతీయ కార్యక్రమాల గురించి రికార్డులు పరిశీలించారు. అలాగే అన్ని జాతీయ కార్యక్రమాల గురించి రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. తల్లి పాల ప్రాముఖ్యత, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తగు సూచనలు ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ కాన్పులు జరిగే విధంగా తగు సూచనలు చేశారు. ఈ కార్య క్రమం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వైద్యాధికారి డాక్టర్ ఓర రాంబాబు, డి పి హెచ్ ఎం. మంగమ్మ , నర్సింగ్ ఆఫీసర్ ఉదయశ్రీ, ఎస్ ఎం టి. షాను బేగం, ఎం పి హెచ్ ఎస్(ఎఫ్) ఆర్. రమేష్, ఎం ఎల్ హెచ్ పి ఎస్, జి. అమల, ఫర్మాసిస్ట్ (ఎం) ఎం. మనోహర్, యునాని ఫర్మశిస్ట్ కె .వెంకటేశ్వర్లు, హెచ్ ఏ.(ఎం) వి.దాసు, హెచ్ ఏ. ((ఎం), ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.