Homeహైదరాబాద్latest Newsఈ కమెడియన్ గుర్తున్నాడా?.. ఇతని కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హీరో.. ఎవరో తెలుసా..?

ఈ కమెడియన్ గుర్తున్నాడా?.. ఇతని కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హీరో.. ఎవరో తెలుసా..?

అప్పట్లో టాలీవుడ్లో చాలా మంది కమెడియన్లు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో లక్ష్మీపతి కూడా ఒకరు. కితకితలు సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. బాబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. అయితే ఆయన కొడుకు ఇప్పుడు హీరో అని మీకు తెలుసా? సొంత కొడుకు కాదండి తన తమ్ముడి కొడుకు.. లక్ష్మీపతికి సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయానా తమ్ముడు అవుతాడు. మహేశ్‌బాబు ‘బాబీ’, ప్రభాస్‌ ‘వర్షం’ సినిమాలకు శోభన్ దర్శకత్వం వహించారు.

కాగా 2008లో శోభన్ అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ఆయన చనిపోయిన నెల రోజుల్లోనే కుంగుబాటుకు గురై లక్ష్మీపతి కూడా మరణించారు. శోభన్ కొడుకులు ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ 2011లో గోల్కొండ హైస్కూల్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. 2018లో పేపర్ బాయ్ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ఏక్ మినీ కథ, ‘అన్నీ మంచి శకునములే’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. అతని తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటుడిగా రాణిస్తున్నారు. మ్యాడ్ సినిమాలో ఒక హీరోగా నటించాడు.

Recent

- Advertisment -spot_img