దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ 173 పాయింట్ల నష్టంతో 79,823 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 24,294 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్లో ఐటీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటన్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.